News July 19, 2024

అమ్మకానికి గుజరాత్ టైటాన్స్?

image

IPL ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లో వాటా అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. అదానీ లేదా టోరెంట్ గ్రూపులకు GTలో సింహభాగం షేర్‌ను విక్రయించాలని ప్రస్తుత యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ యోచిస్తోంది. నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపుగా సీవీసీ విక్రయించాల్సి ఉంటుంది. GTని 2021లో రూ.5625 కోట్లకు సీవీసీ కొనగా.. ప్రస్తుత విలువ బిలియన్ డాలర్లకు పైమాటేనని అంచనా.

Similar News

News January 23, 2026

మెస్సీ మ్యాచ్‌కు CSR నిధులు… ఇరకాటంలో సింగరేణి

image

TG: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు సహా సింగరేణి కార్యకలాపాలపై కేంద్ర బృందం లోతుగా పరిశీలిస్తోంది. కోల్ మైన్ టెండర్ల నిబంధనల వివాదం, అక్రమాలపై ఆరా తీస్తోంది. CSR నిధులపైనా దృష్టి పెట్టింది. ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఈవెంట్‌కు CSR నిధులు వినియోగించారు. ఈవెంట్‌ కోసం ₹10cr నిధులు వాడినట్లు ప్రకటించడం తెలిసిందే. 3 రోజుల్లో ఈ బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది.

News January 23, 2026

మారని BCB నిర్ణయం.. T20 WCలో స్కాట్లాండ్‌!

image

T20 WC నుంచి BAN నిష్క్రమణ దాదాపు ఖరారు కావడంతో స్కాట్లాండ్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్సర్స్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చేందుకు ICC సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. T20 WCలో ఆడాలనే ఉన్నా తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. FEB 7న WIతో కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

News January 23, 2026

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.