News July 19, 2024
SRPT: రేపే బదిలీ.. అంతలోనే ఏసీబీకి చిక్కాడు

సూర్యాపేట జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉదయం నుంచి ఆ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గతంలో సదరు అధికారి రెండు సార్లు ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది. రేపు సూర్యాపేట నుంచి బదిలీ కావాల్సి ఉండగా అంతలోనే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 26, 2025
NLG: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత ఉండొద్దు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, ఇతర సామాగ్రి కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పీడీని దీనికి నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక ట్యాక్స్ నిధులు పంచాయతీరాజ్ శాఖ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 25, 2025
NLG: రూ.50 కోట్లకు పైగా బకాయిలు..!

జిల్లాలో విద్యార్థులకు చదువులు భారంగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా విద్యార్థుల బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ వంటి కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రూ.50 కోట్లకు పైగానే బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలు చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు.
News August 25, 2025
NLG: జూనియర్లకు ఎఫ్ఆర్ఎస్.!

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఇప్పుడు విద్యార్థులకు కూడా విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 31 కళాశాలలో ఈ నెల 23 నుంచి విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు AI ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరిగేది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా విద్యార్థుల హాజరును కచ్చితంగా ట్రాక్ చేస్తున్నారు.