News July 19, 2024
మరోసారి సంజూ శాంసన్కు మొండిచేయి!

ప్రతిసారిలాగే ఈ సారి కూడా టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్కు అవకాశమిచ్చిన సెలక్టర్లు వన్డేలకు మాత్రం మొండిచేయి చూపారు. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో శాంసన్ సెంచరీ చేశారు. అయినా ఆయనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దూబే లేదా పరాగ్లలో ఎవరో ఒకరి స్థానంలో సంజూకు చోటివ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 18, 2025
ఈనెల 23న OTTలోకి ‘OG’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ‘OG’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23న ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్కు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. గత నెల 25న రిలీజైన ఈ మూవీ సరిగ్గా 4 వారాల్లోనే OTTలోకి రాబోతోంది.
News October 18, 2025
APPLY NOW: NTPCలో ఉద్యోగాలు…

NTPC లిమిటెడ్లో 10 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 21 ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై, న్యూక్లియర్ ఫీల్డ్లో పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://careers.ntpc.co.in/
News October 18, 2025
కోతుల బెడద.. గ్రామస్థులు ఏం చేశారంటే..

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కూరెళ్లలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సమస్యను తామే పరిష్కరించుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కోతులను బంధించే బృందాన్ని రప్పించాలని, ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.300 చెల్లించాలని గ్రామస్థులు సమావేశమై నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి రూ.1,000 చొప్పున ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించారు.