News July 20, 2024
ఆదిలాబాద్: ధరణి ఆపరేటర్లకు స్థానచలనం

ADB జిల్లా వ్యాప్తంగా 18 మంది ధరణి అపరేటర్లకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను ఎట్టకేలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో చేరాలని ఆదేశించారు. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొందరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారని అంతా భావించినా.. పక్క మండలానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 23, 2025
ఆదిలాబాద్: డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చందుకు స్పెషల్ డ్రైవ్స్

ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు కాలనీలు, దుకాణాల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రోమా సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేసేవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 22, 2025
ఆదిలాబాద్లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్

ఆదిలాబాద్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం రాత్రి పర్యటించారు. ఆమె పర్యటనలను గోప్యంగా ఉంచారు. పట్టణంలోని టీటీడీసీలో ఆమె బస చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. అనంతరం నాయకులతో మాట్లాడి జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్ పాల్గొన్నారు.
News August 22, 2025
ఆదిలాబాద్లో గణేశ్ ఉత్సవాలకు డీజేలు నిషేధం

ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో డీజేలకు అనుమతి లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. డీజేలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గణపతి మండపాల వద్ద సౌండ్ బాక్సులు, మైక్ సెట్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర నుంచి డీజేలను అద్దెకు తెచ్చి ఇచ్చేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.