News July 20, 2024

గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

గజ్వేల్ మండలం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక CI సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ఏటిగడ్డకిష్టాపూర్ R&R కాలనీకి చెందిన రాజేశ్ బంధువైన మురళితో కలిసి ప్రజ్ఞపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును, ఓ భవనం మెట్లను ఢీకొన్నారు. మురళికి గాయాలవగా, రాజేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదైంది.

Similar News

News August 22, 2025

మెదక్: ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దు: ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున్న పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు ఇతర కార్యక్రమలు చేపడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 22, 2025

మెదక్: ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

image

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్‌ అధికారి మాధవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా తమకు నచ్చిన కళాశాలలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.

News August 22, 2025

ఇన్ స్పైర్ నామినేషన్లు గడువులోగా పూర్తి చేయాలి: డీఈవో

image

ఇన్ స్పైర్ నామినేషన్లను గడువులోగా పూర్తి చేయాలని మెదక్ డీఈఓ రాధా కిషన్ సూచించారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎస్ఓ నవీన్ కలిసి అన్ని మండలాల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్చువల్ పద్ధతిలో అవగాహన కల్పించారు. నామినేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల నూతన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు.