News July 20, 2024

HYDలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి

image

HYDలోని దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న NZB జిల్లాకు చెందిన ఆశ్మిత్, జస్వంత్, నవనీత్ మరో స్నేహితుడు హరితో కలిసి శుక్రవారం సాయంత్రం టీ తాగేందుకు కారులో వెళ్లారు. దుండిగల్ ఎగ్జిట్ నం.5 వద్ద బౌరంపేట-గండిమైసమ్మ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొంది. దీంతో అక్షయ్, అశ్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందినట్లు CI శంకరయ్య తెలిపారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News August 17, 2025

NZB: 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

image

నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.

News August 17, 2025

నిజామాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఎన్నంటే?

image

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇక జనవరి నుంచి పౌర సరఫరా రంగంలో 11,852 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని అధికారులు తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,19,330 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి ప్రభుత్వం రూ.30.73 కోట్ల సబ్సిడీ అందించిందని వెల్లడించారు.

News August 17, 2025

NZB: 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

image

నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.