News July 20, 2024

గోదావరిలో గల్లంతైన రాజు మృతదేహం లభ్యం

image

ఆలుబాకకు చెందిన బానారి రాజు చేపలకు వేటకు వెళ్లి గోదావరిలో ప్రమాదవశాత్తు నిన్న గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రాజు మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. రాజు మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Similar News

News August 17, 2025

ఖమ్మం: తగ్గుముఖం పట్టిన మున్నేరు

image

మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు.

News August 17, 2025

ఖమ్మంలో రెండు రోజులు పూల వ్యాపారం బంద్

image

ఖమ్మంలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది. బంద్‌కు సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News August 16, 2025

‘మున్నేరు పరివాహకా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎగువన వర్షాలు అధికంగా కురుస్తున్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.