News July 20, 2024

దాడులపై పార్లమెంట్‌లో గళం వినిపించాలి: జగన్

image

AP: వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. 23వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్‌లో చర్చ జరిగేలా చూడాలని జగన్ సూచించారు. అలాగే 22 నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయించింది.

Similar News

News November 11, 2025

ఏపీలో నేడు..

image

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు

News November 11, 2025

2700 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 2,700 అప్రెంటిస్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. NATS లేదా NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 11, 2025

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.