News July 20, 2024
NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నగరంలోని మానిక్ భండార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం శుక్రవారం రాత్రి ఆసుపత్రికి వచ్చాడు. రాత్రి తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రి కారిడార్లో నిద్రించాడు. లేచి చూసేసరికి బాలుడిని ఎవరో ఎత్తుకెళ్లరాని బాధితుడు తెలిపాడు. వెంటనే ఆసుపత్రిలో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు కేసు నమోదు చేశారు.
Similar News
News August 17, 2025
NZB: చర్చీలు, మైనారిటీల అభివృద్ధికి నిధులు ఎన్నంటే?

మైనారిటీ సంక్షేమానికి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 53 చర్చిల నిర్మాణం, వాటి ప్రహరీ గోడల పనులకు రూ.7.18 కోట్లు కేటాయించారు. అలాగే, 53 ఉర్దూ ఘర్ కం-షాదీఖానాల నిర్మాణ పనులకు రూ.7.85 కోట్లు పరిపాలన మంజూరు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నిధులు జిల్లాలోని మైనారిటీల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనున్నాయని తెలిపారు.
News August 17, 2025
NZB: 638 సంఘాలు.. రూ 72.22 కోట్ల రుణాలు

నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.
News August 17, 2025
నిజామాబాద్: రూ. 57.98 కోట్ల పెన్షన్ల పంపిణీ

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.