News July 20, 2024

HYD: అప్పులు చేసిన ఘనత KCRది: మహేశ్ కుమార్ గౌడ్

image

పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాజీ సీఎం KCRది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, MLCమహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పలువురు BRS నుంచి కాంగ్రెస్‌లో చేరగా ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని కొనియాడారు. BRS హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?

Similar News

News October 2, 2024

HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!

image

HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT

News October 2, 2024

HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.

News October 2, 2024

HYD: బాపు‌ఘాట్‌లో గవర్నర్ నివాళులు

image

సత్యం, అహింస, ప్రేమ, స్వచ్ఛత అనే విలువలకు కట్టుబడి ప్రజలు మహాత్మా గాంధీ కలలు కన్న భారతం సాకారం చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులర్పించారు.