News July 20, 2024

కొత్తగూడెం: ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉ.11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులకు వీలుగా “గ్రీవెన్స్ డే”ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి నేరుగా తెలపడానికి అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News August 22, 2025

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా

image

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరగనున్న పర్యటన వాయిదా పడిందని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన వాయిదా పడిందని తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

News August 22, 2025

ఖమ్మం: ఈనెల 23న జాబ్ మేళా

image

టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న 47 పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 25-45 సం. వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.

News August 21, 2025

ఖమ్మం: 30 రోజుల కస్టడీ బిల్లు.. ప్రతిపక్షాలపై కుట్ర: సీపీఐ

image

ప్రజలందరికీ దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తోందని CPI(M) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన దొంగల కోటయ్య సంస్కరణ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేసే చర్యల్లో భాగమే 130 రోజుల కస్టడీ బిల్లు అని తమ్మినేని పేర్కొన్నారు.