News July 20, 2024
NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి

NZB జిల్లాలో గడిచిన ఏడాదిన్నరలోనే రోడ్డు ప్రమాదాలలో 550 మంది ప్రాణాలు కోల్పోయారని CP కల్మేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Similar News
News May 7, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.
News May 7, 2025
నిజామాబాద్: బావిలో పడి వ్యక్తి మృతి

జక్రాన్పల్లిలో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మాడవీరి ముత్యం(50) తాగిన మైకంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 7, 2025
NZB: జిల్లా వాసికి జాతీయ అవార్డు

నిజామాబాద్ జిల్లా వాసికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే నెల 13న రాష్ట్రపతి భవన్లో జరిగే సమావేశంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ను జిల్లా రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.