News July 20, 2024
పెద్దవాగు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్

TG: పెద్దవాగుకు గండి పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సకాలంలో ప్రాజెక్ట్ గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. తమను రక్షించాలని అధికారులకు ప్రజలు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని, AP నుంచి హెలికాప్టర్లు రాకుంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కాగా రేపు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పెద్దవాగును పరిశీలించి, మరమ్మతులపై అధికారులతో చర్చించనున్నారు.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


