News July 21, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,538 మంది భక్తులు దర్శించుకోగా 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.

Similar News

News November 4, 2025

ఆధార్ PVC కార్డును ఈజీగా అప్లై చేయండిలా!

image

ఆధార్‌ను PVC కార్డుగా మార్చుకుంటే ఎక్కువ మన్నికగా ఉంటుంది. పర్సులో పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో-టెక్స్ట్, సెక్యూర్ క్యూఆర్ కోడ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న ఈ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> మీ ఆధార్ నంబర్ లేదా EIDతో లాగిన్ అవ్వాలి. OTP ద్వారా ధ్రువీకరించి రూ.50 చెల్లిస్తే చాలు ఈ కార్డు ఇంటికే వస్తుంది. SHARE IT

News November 4, 2025

CSIR-NIOలో 24 ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(<>NIO<<>>) 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ (ఆర్కియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, BZC) ఉత్తీర్ణులు DEC 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు ఫీజులేదు. వెబ్‌సైట్: https://www.nio.res.in

News November 4, 2025

నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

image

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవ‌ద్ద‌నే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిల‌కు తాళి ఉన్న‌ట్లు అబ్బాయిల‌కు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివ‌క్ష లాంటిదే’ అని చెప్పారు.