News July 21, 2024
విజయవాడ: లక్షకు రూ.10 లక్షలిస్తామని మోసం

లక్ష కడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ పవన్, నాగూర్, అనిత, నాగరాజు అనే నలుగురు మోసం చేశారంటూ, నున్న పోలీసులకు గుంటూరుకు చెందిన సరస్వతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ముఠా డబ్బుతో ఉన్న ఒక గోడౌన్ చూపించి లక్షకు పది లక్షలిస్తామంటే అప్పు చేసి రూ.36 లక్షలు వారికి ఇచ్చానని సరస్వతి పోలీసులకు తెలిపింది. విజయవాడ సుందరయ్యనగర్లోని నాగూర్ ఇంటికి వచ్చి డబ్బు అడగగా స్పందించలేదని బాధితురాలు వాపోయింది.
Similar News
News July 9, 2025
కృష్ణా: పీఏసీఎస్లకు త్రిసభ్య కమిటీలు

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS)లకు త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మొత్తం 66 పీఏసీఎస్లకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఛైర్మన్గా ఒకరు, సభ్యులుగా ఇద్దరిని నియమించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో పీఏసీఎస్ల సీఈఓ, కార్యదర్శులు పని చేయనున్నారు. పీఎసీఎస్లకు ఎన్నికలు నిర్వహించే వరకు ఈ కమిటీలు పని చేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News July 8, 2025
నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.
News July 8, 2025
మచిలీపట్నంలో రూ.7.88 లక్షల జరిమాన

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. 34 బృందాలుగా ఏర్పడిన అధికారులు జరిపిన తనిఖీల్లో 230 సర్వీసులపై అదనపు లోడును గుర్తించి రూ.7.88 లక్షల మేర జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వాసు హెచ్చరించారు.