News July 21, 2024
‘మురారి’ ఫ్లాప్ అంటూ ట్వీట్.. స్పందించిన కృష్ణవంశీ

మహేశ్ ‘మురారి’ ఫ్లాప్ అంటూ ఓ వెబ్సైట్కు చెందిన ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్పై ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. ‘నేను మురారి ‘తూర్పుగోదావరి’ హక్కుల్ని నిర్మాత వద్ద రూ.55లక్షలకు కొన్నాను. రూ.1.30కోట్లు వచ్చాయి. సక్సెస్కు లాభాలే కొలమానమైతే ఆ సినిమా హిట్టో కాదో మీరే డిసైడ్ చేయండి’ అని పేర్కొన్నారు. రిప్లై ఇంకొంచెం ఘాటుగా ఇవ్వాల్సిందంటూ ఓ అభిమాని కోరగా తప్పని కృష్ణవంశీ వారించారు.
Similar News
News April 1, 2026
GK: భారతీయ రైల్వే – కీలక విషయాలు

*మొదటి రైలు: భారతదేశంలో మొదటి రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై (బోరి బందర్) నుంచి థానే వరకు (34 కి.మీ) నడిచింది.
*రైల్వే జోన్లు: ప్రస్తుతం 19 రైల్వే జోన్లు ఉన్నాయి (మెట్రో రైల్ కోల్కతాతో కలిపి).
*అతి పొడవైన రైలు మార్గం: వివేక్ ఎక్స్ప్రెస్ – ఇది దిబ్రూగఢ్ (అస్సాం) నుండి కన్యాకుమారి (తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది.
*మొదటి విద్యుత్ రైలు: 1925లో ముంబై నుండి కుర్లా మధ్య నడిచిన డెక్కన్ క్వీన్.
News April 1, 2026
చందమామపైకి చిన్నారి బొమ్మ

దాదాపు 53 ఏళ్ల తర్వాత నాసా చేపట్టే మానవసహిత చందమామ యాత్ర (Artemis II) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మిషన్లో నలుగురు వ్యోమగాములతో పాటు ‘రైజ్’ అనే బొమ్మ కూడా ప్రయాణం చేయనుంది. దీన్ని కాలిఫోర్నియాకు చెందిన 8 ఏళ్ల లూకాస్ తయారు చేశాడు. 1961 నుంచి ఉన్న ‘జీరో గ్రావిటీ ఇండికేటర్’ సంప్రదాయం ప్రకారం వ్యోమగాములు ఓ బొమ్మను తీసుకెళ్తారు. ఈసారి 50 దేశాల నుంచి వచ్చిన 2,600 ఎంట్రీల్లో ఇది ఎంపికైంది.
News April 1, 2026
E20 పెట్రోల్తో సమస్యలు.. నిజమెంత?

E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లో సమస్యలు తలెత్తుతాయనే వదంతులు వినిపిస్తున్నాయి. వీటిలో నిజం లేదని కేంద్రం గతేడాదే స్పష్టం చేసింది. పవర్, టార్క్ తగ్గుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని తెలిపింది. అలాగే కొన్ని రబ్బర్లు, గాస్కెట్లు పాడవుతాయనడంలోనూ వాస్తవం లేదని పేర్కొంది. పైగా ఈ ఇంధనం వల్ల పర్యావరణానికి మేలని వివరించింది. మైలేజీ విషయంలో మాత్రమే స్వల్పంగా తగ్గుదల ఉంటుందని వెల్లడించింది.


