News July 21, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన ఎస్పీ సతీశ్ కుమార్

image

గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం సమష్టిగా పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సతీశ్ కుమార్ ఆదివారం సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం ఎస్పీ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసం, అమరావతి రాజధాని ప్రాంతం ఈ జిల్లాలోనే ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఎస్పీ వెల్లడించారు.

Similar News

News November 9, 2025

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

image

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.

News November 9, 2025

GNT: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నేడు పెదకాకానిలోని శంకర ఐ హాస్పిటల్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేసిన ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పర్యటించి పరిశీలించారు. ఏర్పాట్లని పక్కాగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News November 8, 2025

తుళ్లూరు: APCRDA ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

image

APCRDA ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీలో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం నుంచి 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది మహిళలు శిక్షణకు హాజరుకాగా పలువురు అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.