News July 21, 2024

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా KKR మాజీ ప్లేయర్!

image

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను నియమించేందుకు BCCI అంగీకరించినట్లు సమాచారం. శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ BCCIకి సూచించారు. 2014 IPL సీజన్‌లో గంభీర్‌ KKR కెప్టెన్‌ కాగా మార్కెల్ జట్టులో ఉన్నారు. గంభీర్ లక్నోకి మెంటార్‌గా ఉన్నప్పుడు ఆయన బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News September 16, 2024

నీరజ్ చోప్రా తాజా ట్వీటుకు మనూ భాకర్ స్పందన ఏంటంటే?

image

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని షూటర్ మనూ భాకర్ ఆకాంక్షించారు. డైమండ్ లీగులో రజతంతో 2024లో ఈ సీజన్‌ను అద్భుతంగా ముగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సీజన్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే ద్వారా తెలిసింది. మీ సపోర్టుకు థాంక్స్’ అన్న నీరజ్ ట్వీటుకు మను స్పందించడం నెటిజన్లను ఆకర్షించింది.

News September 16, 2024

75ఏళ్లలో అతి పెద్ద తుఫాన్.. చైనాలోకి ఎంట్రీ

image

పెను తుఫాను బెబింకా చైనాలోని షాంఘైలో తీరం దాటింది. దాన్ని కేటగిరీ-1 తుఫానుగా పేర్కొంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. 1949లో గ్లోరియా టైఫూన్ తర్వాత గడచిన 75 ఏళ్లలో ఈస్థాయి తుఫాను రాలేదని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో షాంఘైలో వందలాది విమానాలను రద్దు చేశారు. కాగా గత వారమే చైనాలో యాగీ తుఫాను తీరం దాటిన సంగతి తెలిసిందే.

News September 16, 2024

బాణసంచా పేలి భవనం ధ్వంసం.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.