News July 22, 2024
పవన్కళ్యాణ్కు సెక్యూరిటీ పెంచాలి: వర్మ

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సెక్యూరిటీ పెంచాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కోరారు. పిఠాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర నిఘా సంస్థలు సైతం పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందని సమాచారం ఇచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News October 22, 2025
స్త్రీ శక్తి పథకం మరింత ముందుకు తీసుకువెళ్లాలి: DPTO

‘స్త్రీ శక్తి’ పథకం మరింత ముందుకు సాగేందుకు ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల యజమానులు సహకరించాలని డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి కోరారు. బుధవారం రాజమండ్రి కార్యాలయంలో డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. పథకం విజయానికి ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సుల పాత్ర కూడా ముఖ్యమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చాలని సూచించారు.
News October 22, 2025
96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు: కలెక్టర్

ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. ఆధార్ రికార్డులు అప్డేట్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా అవకాశాలను పొందగలుగుతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
గోదావరి తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రాగల 24 గంటల్లో వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాల్లోని తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అవసరమైతే తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.