News July 22, 2024

రీల్స్ పిచ్చి.. పనిమనిషి ఏం చేసిందంటే?

image

తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలని రీల్స్ చేయాలనుకుంది ఓ పనిమనిషి. అందుకు మంచి కెమెరా కొనాలనుకుంది. కానీ డబ్బులు లేవు. ఇంకేముంది పనిచేసే ఇంటికే కన్నం వేసింది. ఢిల్లీలోని ఓ బంగ్లాలో పనిచేసే నీతూయాదవ్(30)కు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఈక్రమంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ కావాలని యజమాని ఇంట్లో చోరీ చేసింది. రూ.లక్షల విలువైన నగలతో పరారైంది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.

Similar News

News January 20, 2026

TN గవర్నర్ వాకౌట్‌కు కారణాలివే: లోక్‌భవన్

image

TN అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేయడానికి గల కారణాలను లోక్‌భవన్ వెల్లడించింది. ‘గవర్నర్ ప్రసంగిస్తుండగా పలుమార్లు మైక్రోఫోన్ ఆఫ్ చేశారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్లు, ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయి. నేరాల పెరుగుదల, 55% పెరిగిన POCSO కేసులు, 33% పెరిగిన లైంగిక వేధింపుల వంటి అనేక సమస్యలను ప్రసంగంలో ప్రస్తావించలేదు’ అని స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.

News January 20, 2026

మూవీ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

image

TG: సినిమా టికెట్ ధరల <<18819916>>పెంపుపై<<>> తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. MSVPG టికెట్ ధరల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయమై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, <<18817219>>సీవీ ఆనంద్‌<<>>కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇకపై మూవీ టికెట్ ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

News January 20, 2026

రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

image

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్‌షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.