News July 22, 2024

భద్రాచలం: గోదావరి వద్ద సెల్ఫీ దిగితే.. పోలీస్ స్టేషన్‌కే

image

గోదావరిలో వదర ఉధృతి భద్రాచలంలో జిల్లా రెవెన్యూ అధికారుల పలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటికే గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉందన్నారు. కాగా, గోదావరి బ్రిడ్జి పై సెసెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని అధికారులు నిబంధన పెట్టారు. నిబంధన ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరించారు.

Similar News

News September 12, 2025

ఖమ్మం: అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్&బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ వంటి శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రస్తుత పనులపై వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

News September 11, 2025

బీసీల కులగణనలో తెలంగాణ ఆదర్శం: పొంగులేటి

image

బీసీల కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షా నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

News September 11, 2025

ఖమ్మం ఐటీ హబ్‌లో ప్లేస్‌మెంట్ డ్రైవ్

image

ఖమ్మం ఐటీ హబ్‌లో ఈ నెల 15న టాస్క్ ఆధ్వర్యంలో టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని జిల్లా మేనేజర్ దినేష్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో బీటెక్ లేదా డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7981093223 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.