News July 22, 2024
ముగిసిన రొట్టెల పండగ…. ఇక వచ్చే ఏడాదే
గత ఐదు రోజులుగా నెల్లూరు నగరంలో జరుగుతున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఆదివారంతో ముగిసింది. సెలవు దినం కావడంతో చివరి రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ఈసారి రొట్టెల పండుగకు విచ్చేశారు. గత ఏడాది కంటే ఈసారి వచ్చిన భక్తులకు ఎక్కడ అసౌకర్యం ఏర్పడకుండా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.
Similar News
News October 1, 2024
కోర్టు కేసులపై అధికారులు స్పందించాలి: కలెక్టర్ ఆనంద్
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులపై జిల్లా అధికారులు స్పందించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News September 30, 2024
నెల్లూరు: SP కార్యాలయానికి 105 ఫిర్యాదులు
నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్లు ASP CH.సౌజన్య తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.
News September 30, 2024
SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It
SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.