News July 22, 2024
ప్రత్యక్ష పన్నులతో కేంద్రానికి 55% ఆదాయం

FY24లో స్థూల పన్ను ఆదాయాన్ని 13.4 శాతంగా ఆర్థిక సర్వే అంచనా వేసింది. FY23లో ప్రత్యక్ష పన్నుల్లో 15.8%, పరోక్ష పన్నుల్లో 10.6% వృద్ధిరేటే ఇందుకు కారణమని వివరించింది. డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 55%, ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ నుంచి 45% ఆదాయం వస్తున్నట్టు వెల్లడించింది. పన్ను సంస్కరణలే ఇందుకు కీలకంగా నిలిచాయని పేర్కొంది. కార్పొరేట్, కస్టమ్స్, జీఎస్టీ ద్వారానూ కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగానే వస్తోంది.
Similar News
News July 5, 2025
బాధ్యతలు స్వీకరించిన రామ్చందర్ రావు

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.