News July 22, 2024
ఇద్దరు MLAల ప్రమాణం చట్టవిరుద్ధం.. చెరో ₹500 ఫైన్: WB రాజ్భవన్

పశ్చిమబెంగాల్లో TMC ఎమ్మెల్యేలు రేయాత్ హుసేన్, సయంతికా బెనర్జీ ప్రమాణస్వీకారంపై గందరగోళం నెలకొంది. వారితో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాజ్భవన్ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ వారికి రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలని తెలిపింది. ఈ విషయమై ఎమ్మెల్యేలు స్పీకర్ను ఆశ్రయించారు. కాగా ఉపఎన్నికల్లో గెలిచిన వీరిద్దరితో ఈ నెల 5న స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<