News July 22, 2024

అతనితో మానసికంగా పెళ్లైంది: అవికాగోర్

image

నాలుగేళ్ల ప్రేమ వ్యవహారంపై హీరోయిన్ అవికాగోర్ స్పందించారు. మిలింద్ చాంద్వాని, తాను 6 నెలల పాటు స్నేహితులుగా ఉన్నామని, అతనే ప్రపోజ్ చేసినట్లు చెప్పారు. వెంటనే తాను అంగీకారం తెలిపానన్నారు. తమ ఇద్దరి మనసులు కలిశాయని, మానసికంగా తమకు పెళ్లైందని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా తెలుగులో ఈ అమ్మడు ‘ఉయ్యాలా జంపాలా’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు.

Similar News

News November 7, 2025

పూజకు ఏయే రత్నాలను ఉపయోగించాలి..?

image

‘సువర్ణ రజతం ముక్తా; రాజవర్తం ప్రవాలకం రత్న పంచక మాఖ్యాతం’ అంటే.. బంగారం, వెండి, ముత్యం, వజ్రపు శిల(రాజవర్తం), పగడం(ప్రవాలకం)లను పంచ రత్నాలుగా పరిగణించాలి. ఒకవేళ ఈ ఐదు రత్నాలు దొరకనట్లయితే ‘ఆభావే సర్వ రత్నానాం హేమ సర్వత్ర యోజయేత్’ అన్నట్లు.. వాటి స్థానంలో బంగారాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు. అన్ని రత్నాలలోనూ ఉత్తమమైనది. సమస్త కార్యాలకు వినియోగించడానికి అర్హమైనది. అందుకే పసిడికంత ప్రాధాన్యం. <<-se>>#Pooja<<>>

News November 7, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. కోనసీమ, ప.గో, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అటు తెలంగాణలో ఉ.8.30 గంటల వరకు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసేందుకు స్వల్ప అవకాశముందని HYD IMD పేర్కొంది. తర్వాతి 6 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.

News November 7, 2025

ఒక పూట భోజనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

image

హిందూ ధర్మంలో కొందరు కొన్ని వారాల్లో ఒక పూట భోజనం చేసే వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఒకపూటే తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.శరీరానికి విశ్రాంతి దొరికి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయుష్షు, శక్తి పెరుగుతాయి. ఎక్కువ పూటలు తినడం అనారోగ్యానికి సంకేతం. అందుకే పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఈ నియమాన్ని పాటించాలంటారు. <<-se>>#Aaharam<<>>