News July 23, 2024
కిడ్నాప్ వార్త ఫేక్: పోలీసులు
TG: హైదరాబాద్లో అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ ట్రాప్ చేస్తోందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. రెండ్రోజుల క్రితం తార్నాక మెట్రోస్టేషన్ వద్ద ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేయగా పోలీసులు రక్షించారనే వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయితే ఇదంతా అవాస్తవమని పోలీసులు తెలిపారు. విద్యార్థిని కిడ్నాప్కు గురైన ఘటన ఏదీ జరగలేదని చెప్పారు. ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News September 19, 2024
INDvsBAN: నేటి నుంచే తొలి టెస్టు
చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్టు సిరీస్ ఓడని IND తన ఖాతాలో మరో సిరీస్ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పాక్ను వైట్వాష్ చేసిన ఊపులో ఉన్న బంగ్లా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటోంది. ఉ.9.30 నుంచి స్పోర్ట్స్18లో వీక్షించవచ్చు.
IND అంచనా టీమ్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా
News September 19, 2024
బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్
AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.
News September 19, 2024
మద్యం షాపు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాప్లలో 10 శాతం(340) గీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉ.10 నుంచి రా.10 వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు రూ.50-85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు.