News July 23, 2024
స్వచ్ఛందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలి: ఎస్పీ

ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా స్వచ్ఛందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత మండల ఎస్సైకు ఫోన్ చేసి ఫిర్యాదుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వేగవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఫిర్యాదుదారులతో సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు.
Similar News
News March 1, 2026
మహబూబ్ నగర్: జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు

శాంతిభద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News February 28, 2026
MBNR: అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం

మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు సన్నిధిలో ఆదివారం నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణంతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ తెలిపారు. రేపు ధ్వజారోహణం, గరుడ వాహనసేవ, మంగళవారం విమాన రథోత్సవం. అయితే, చంద్రగ్రహణం కారణంగా ఈసారి కళ్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గ్రహణం రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఆలయ ద్వారబంధనం ఉంటుందన్నారు.
News February 28, 2026
MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


