News July 23, 2024

గ్రేటర్ HYDలో కాలుష్య భూతం..!

image

గ్రేటర్ HYDలో కాలుష్య భూతం మెల్లమెల్లగా పెరుగుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. PM 2.5 వ్యాసం కలిగిన సూక్ష్మ ధూళికణాలకు సంబంధించి గత 4 నెలల రికార్డులను పరిశీలిస్తే జూపార్కు ప్రాంతంలో 115, పాశమైలారం 104, బాలానగర్ 101, ఉప్పల్ 89, జీడిమెట్ల 107, ప్యారడైజ్ 96 మైక్రాన్లుగా నమోదైంది. సాధారణంగా 40 మైక్రాన్ల లిమిట్ దాటితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Similar News

News November 2, 2025

BIG BREAKING: వికారాబాద్ జిల్లాలో ముగ్గురి MURDER, ఒకరిపై హత్యాయత్నం

image

ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి తాను సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య అతడి భార్య, కుమార్తె, వదినను కత్తితో పొడిచి చంపి, మరో కుమార్తెను చంపేందుకు యత్నించాడు. అనంతరం తాను సూసైడ్ చేసుకున్నాడు. పరిగి DSP శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

HYDలో KCR చేసింది ఏం ఉంది: CM రేవంత్ రెడ్డి

image

HYDలో KCR అభివృద్ధి చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డలో నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా CM రోడ్‌ షో‌ నిర్వహించారు. ‘సిటీకి YSR మెట్రో తెచ్చారు. ORR, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ నిర్మించింది. IT, ఫార్మా కంపెనీలు మేమే తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి HYDలో KCR చేసింది ఏం ఉంది’ అంటూ రేవంత్ నిలదీశారు. దీనిపై మీ కామెంట్?

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.