News July 23, 2024

నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి విమానంలో హస్తినకు చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కాగా.. రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాల్గొననున్నారు.

Similar News

News December 30, 2025

అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్‌ స్వీట్ వార్నింగ్

image

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్‌ చేశారు.

News December 30, 2025

సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

image

AP: న్యూఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్లకు పర్మిట్ లైసెన్సులు ఉన్న వారికి రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా రాకుండా అధికారిక పనివేళలు పెంచినట్లు తెలిపింది.

News December 30, 2025

జర్మన్ పౌరుడికి ఎలా పెన్షన్ ఇస్తాం: ఆది శ్రీనివాస్

image

TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ పెన్షన్ పొందడంపై MLA ఆది శ్రీనివాస్ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రమేష్ జర్మన్ పౌరుడు అని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించగా, తప్పుడు పత్రాలతో గెలిచినందుకు హైకోర్టు ఆయనకు రూ.30 లక్షల ఫైన్ విధించిందని ఫిర్యాదులో తెలిపారు. అయినా మాజీ ఎమ్మెల్యేగా ప్రతి నెలా రూ.50వేలు పెన్షన్ అకౌంట్లో జమ అవుతోందన్నారు. అయితే ఈ అంశంపై సెక్రటరీకి నిర్ణయాధికారం లేదు.