News July 23, 2024
అసెంబ్లీకి జగన్ దూరం!

AP: అసెంబ్లీ సమావేశాలకు YCP సభ్యులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు జగన్ తన పార్టీ MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు అక్కడ ధర్నా నిర్వహించి, గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సమావేశాలు ఉంటాయి. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. నిన్న సభకు వచ్చిన జగన్ కాసేపటికే వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
Similar News
News January 16, 2026
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.
News January 16, 2026
ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.
News January 16, 2026
NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


