News July 23, 2024
అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలి: పవన్ కళ్యాణ్

AP: రాష్ట్రంలో వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఏమాత్రం అలసత్వం వద్దని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, రక్షిత మంచినీటిపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వరద ముంపు గ్రామాల గురించి ఆయన ఆరా తీసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
Similar News
News March 30, 2026
జగన్కు క్రెడిట్ చోరీ డిజార్డర్ ముదిరిపోయింది: టీడీపీ

AP: మూలపేట <<19518755>>పోర్టును<<>> 70% తానే పూర్తి చేసినట్లు జగన్ చెప్పుకుంటున్నారని టీడీపీ విమర్శించింది. ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్ ముదిరిపోయిందని ట్వీట్ చేసింది. ‘నిజానికి అది భావనపాడు పోర్టు. దాని పనులు అంతకుముందు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. YCP హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేయగానే జగన్ క్రెడిట్ చోరీ మొదలు పెట్టాడు’ అని మండిపడింది.
News March 30, 2026
BREAKING: వైభవ్ విధ్వంసం

చెన్నైతో మ్యాచ్లో RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసి ఔటయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
News March 30, 2026
భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్

PM మోదీ తనను, తన వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత భవిష్యత్తును తాకట్టు పెట్టారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘మోదీ పాలనలో డాలర్తో పోలిస్తే రూపాయి పతనం రూ.100 దిశగా సాగుతోంది. స్టాక్స్, ఎకానమీ, ఇన్కమ్, సేవింగ్స్ పడిపోయాయి. ఉద్యోగాలు మాయమయ్యాయి. సిలిండర్లు అందుబాటులో లేవు. వీటన్నిటికీ మోదీ రాజీపడటమే కారణం’ అని ట్వీట్ చేశారు.


