News July 23, 2024

పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచుతారా?

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రైతుల కోసం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఏడాదికి 4 వాయిదాల్లో ఇస్తారని సమాచారం. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. దీని వల్ల రైతులు ఈ రుణాన్ని సులభంగా తీసుకునే అవకాశం లభిస్తుంది.

Similar News

News November 7, 2025

ఒక పూట భోజనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

image

హిందూ ధర్మంలో కొందరు కొన్ని వారాల్లో ఒక పూట భోజనం చేసే వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఒకపూటే తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.శరీరానికి విశ్రాంతి దొరికి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయుష్షు, శక్తి పెరుగుతాయి. ఎక్కువ పూటలు తినడం అనారోగ్యానికి సంకేతం. అందుకే పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఈ నియమాన్ని పాటించాలంటారు. <<-se>>#Aaharam<<>>

News November 7, 2025

తండ్రులకూ డిప్రెషన్.. వారికీ చేయూత కావాలి!

image

బిడ్డ పుట్టాక తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఒత్తిడి, చిరాకు, కోపం వంటివి వస్తాయి. ఇప్పుడు బిడ్డను చూసుకునే బాధ్యత తండ్రికీ ఉంటోంది. రాత్రులు నిద్రలేకపోవడం, బాధ్యతలు, ఖర్చులు, ఒత్తిడి, జాబ్ కారణంగా తండ్రుల్లోనూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తండ్రికీ కుటుంబం నుంచి చేయూత అవసరం అంటున్నారు.

News November 7, 2025

అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

image

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌‍లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.