News July 23, 2024
నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్మార్కెట్ సూచీలు స్తబ్ధుగా ముగిశాయి. 80,724 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ ఒకానొక దశలో 1000 పాయింట్ల నష్టంతో 79,224 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత పుంజుకొని 80,766 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్ల నష్టంతో 80,429 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 24,074 వద్ద కనిష్ఠ, 24,582 వద్ద గరిష్ఠ స్థాయుల్ని తాకింది. 30 పాయింట్ల నష్టంతో 24,479 వద్ద క్లోజైంది. టైటాన్, ఐటీసీ షేర్లు 6.5% మేర ఎగిశాయి.
Similar News
News November 9, 2025
తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బృందం రానట్టేనా?

పంట నష్టంపై అంచనా వేసేందుకు APలో ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 8 మంది అధికారులు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఆగస్టులో ₹10వేల కోట్లు, ఇటీవలి తుఫానుతో ₹5వేల కోట్లు నష్టపోయినట్లు TG ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. కానీ దీనిపై కేంద్రం స్పందించలేదు. కనీసం బృందాన్నీ పంపడం లేదు. దీంతో కేంద్రం మరోసారి తెలంగాణకు మొండిచేయి చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.
News November 9, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

✦ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్
✦ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం: సినీ వర్గాలు
✦ రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘దురంధర్’ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల.. బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్
✦ సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాకు 2 రోజుల్లో రూ.2.91కోట్ల కలెక్షన్స్
News November 9, 2025
అవనీ లేఖరాకు మరో స్వర్ణం

2025 పారా షూటింగ్ ప్రపంచ కప్లో షూటింగ్లో అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం సాధించారు. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె తర్వాత షూటింగ్కు మళ్లారు. రెండు ఒలింపిక్స్లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.


