News July 23, 2024

కనిగిరిలో ఘోరం.. వైరు తెగిపడి ముగ్గురు మృతి

image

కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామం ఎస్టీ కాలనీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. పునుగోడు ఎస్టీ కాలనీ వద్దకు రాగానే విద్యుత్ వైర్లు తెగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 6, 2025

వెలుగొండ ప్రాజెక్ట్‌కు రానున్న మంత్రి నిమ్మల

image

నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు,రేపు దోర్నాలలో పర్యటించనున్నారు. నేటి రాత్రికి ఆయన దోర్నాలకు చేరుకుంటారు. రేపు ఉదయం కొత్తూరు వద్ద బ్రీచ్ అయిన తీగలేరు వాగును పరిశీలిస్తారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ సందర్శిస్తారు. ఇటీవల ‘మొంథా’ తుఫాను ప్రభావంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.

News November 5, 2025

ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

image

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

image

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.