News July 24, 2024
CTR: భువనేశ్వరి దత్తత గ్రామం అదే..!

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఆమె మట్లాడుతూ.. ఎక్కువ మెజారిటీ వచ్చిన బూత్ని తాను దత్తత తీసుకుంటానని ఎన్నికల సమయంలో చెప్పానన్నారు. మాట ప్రకారం కంచిబందార్లపల్లిని దత్తత తీసుకుంటున్నట్ల వెల్లడించారు. ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా మారుస్తానని చెప్పారు.
Similar News
News December 27, 2025
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో జరిగింది. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్నం బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతదేహాలను శుక్రవారం బంధువులకు అప్పగించారు.
News December 26, 2025
చిత్తూరు: ఉపాధి రికవరీ బకాయిలు రూ. 1.59 కోట్లు

చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ తనిఖీ రికవరీలో ఇంకా రూ. 1.59 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఐదేళ్లలో సోషల్ ఆడిట్లో రూ. 4.85 కోట్ల మేర అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిని రికవరీ చేయాలని ఆదేశించగా ఇప్పటివరకు రూ. 3.26 కోట్లను వసూలు చేశారు. రికవరీకి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
News December 25, 2025
క్రీస్తు లోక రక్షకుడు: చిత్తూరు కలెక్టర్

చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీట్టీ మెమోరియల్ చర్చ్లో రేవ శామ్వేల్ ఆర్థర్ అధ్యక్షతన ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి హాజరయ్యారు. లోక రక్షకుడైన క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. క్రీస్తు లోక రక్షకుడని, ఆయన జననం లోకానికి సమాధానమని తెలిపారు.


