News July 24, 2024

కడప: పర్యావరణ సహితంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి

image

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సహిత, ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణంలో గణేశ్ చతుర్థి, విజయదశమి ఉత్సవాలను జరిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలని చేపట్టాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యావరణ సహితంగా గణేశ్ చతుర్థి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై వీసీ నిర్వహించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు.

Similar News

News November 10, 2025

కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

image

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2025

ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

image

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 10, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్‌ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.