News July 24, 2024
నెల్లూరు: ఫలితాల కోసం వీఎస్యూ విద్యార్థుల ఎదురుచూపులు
విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు 4వ సెమిస్టర్ పరీక్షలు రాసి 3 నెలలు అవుతుంది. వచ్చే నెల 22వ తేదీన ఐసెట్ కౌన్సిలింగ్ చివరి తేదీ. అయినప్పటికీ ఇంకా 4వ సెమిస్టర్ రిజల్ట్స్ రాకపోవడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు యూనివర్సిటీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 1, 2024
కోర్టు కేసులపై అధికారులు స్పందించాలి: కలెక్టర్ ఆనంద్
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులపై జిల్లా అధికారులు స్పందించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News September 30, 2024
నెల్లూరు: SP కార్యాలయానికి 105 ఫిర్యాదులు
నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్లు ASP CH.సౌజన్య తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.
News September 30, 2024
SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It
SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.