News July 24, 2024
ఖమ్మం, మంచిర్యాల వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక
విజయవాడ మీదుగా ప్రయాణించే పట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ప్రయోగాత్మకంగా ఖమ్మం, మంచిర్యాల స్టేషన్లలో స్టాప్ ఇచ్చామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22669 ఎర్నాకులం- పట్నా ట్రైన్కు ఈ నెల 27 నుంచి ఖమ్మం, మంచిర్యాలలో స్టాప్ ఇచ్చామన్నారు. ఈ నిర్ణయంతో ఈ రైలు బయలుదేరే, గమ్యస్థానం చేరుకునే సమయాలలో మార్పులు లేవని రైల్వే అధికారులు చెప్పారు.
Similar News
News October 7, 2024
అభివృద్ధిలో మరో ముందడుగు పడింది: MLA సుజనా
NDA ప్రభుత్వ పాలనలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని విజయవాడ పశ్చిమ MLA సుజనా ట్వీట్ చేశారు. రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని సుజనా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని నుంచి సమీప జిల్లాలలో ప్రాంతీయ ప్రగతి మరింత పెరగనుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News October 7, 2024
లక్ష్యాలు అధిగమించి మంచి పేరు తీసుకురండి: కలెక్టర్
ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో ప్రతిరోజు లేదా 2రోజులకు ఒకసారి తప్పనిసరిగా వారి కార్యకలాపాలను సమీక్షించు కోవాలన్నారు.
News October 7, 2024
కృష్ణా: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.