News July 24, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 3 రోజులుగా పత్తి ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి ధర మంగళవారం రూ.7,180కి చేరింది. నేడు మరికొంత పెరిగి రూ.7,230 అయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తేమ లేని, నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకురావాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

Similar News

News October 2, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలు బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె హమిద్ వరంగల్ వి.ఆర్ నుంచి బచ్చన్నపేటకు, కె.సతీశ్ బచ్చన్నపేట నుంచి ఐటీ వరంగల్‌కు, బి.చందర్ వరంగల్ మిల్స్ కాలనీ నుంచి వర్ధన్నపేటకు, ఏ.ప్రవీణ్ కుమార్ వర్ధన్నపేట నుంచి కేయూ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 2, 2024

వరంగల్: డీజే వినియోగం నిషేధం: పోలీస్ కమిషనర్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజేలనుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్స్, బాణాసంచా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News October 1, 2024

వరంగల్ నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 12 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామని వరంగల్ రీజియన్ RM డి.విజయభాను తెలిపారు. ప్రయాణికులకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. (HNK 125, JN 120, WGL 1 నుంచి 125, WGL 2 డిపో 125, MHBD 47, NSPT 119, PKL 93, TRR 48, BHPL 48) మొత్తం 850 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.