News July 24, 2024
BRS వైఖరి ఇంకా మారలేదు: సీఎం రేవంత్

TG: తప్పులు చేసిన BRSను ప్రజలు శిక్షించారని, అయినా ఆ పార్టీ నేతల వైఖరి మారలేదని CM రేవంత్ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని విమర్శించారు. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చినా రోడ్లు వేయలేదని, విద్యుత్ సౌకర్యం కల్పించలేదని అన్నారు. తాము అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. 7లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదని CM చెప్పారు.
Similar News
News November 5, 2025
వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మీ(డెమోక్రాట్) విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. హష్మీ 1964లో HYDలో జన్మించారు. మలక్పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్లి స్థిరపడ్డారు. బీఏ ఆనర్స్, సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. 1991లో రిచ్మండ్కు వెళ్లిన ఆమె 30 ఏళ్లపాటు ప్రొఫెసర్గా పనిచేశారు.
News November 5, 2025
వరి మాగాణుల్లో నువ్వులు, ఆవాలు ఎప్పుడు చల్లుకోవాలి?

రాయలసీమ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో వరి కోసే 10 రోజులకు ముందు ఆవాలు, నువ్వుల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. ఆవాలు ఎకరాకు 1 నుంచి 1.5కిలోలు, నువ్వులు ఎకరాకు 1.5 నుంచి 2 కిలోలు అవసరం. ఆవాల విత్తనాలను 5-6 కిలోల సన్నని ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా వెదజల్లాలి. ఆ సమయంలో బురద పదునులో విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. నువ్వుల విత్తనాలను 1.5kg బియ్యపు నూకలతో కలిపిచల్లితే సమానంగా పొలంలో పడతాయి.
News November 5, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.


