News July 24, 2024
శవ రాజకీయాలు మానుకో జగన్: జీవీ

AP: చంద్రబాబు ఢిల్లీ నుంచి నిధులను సాధించుకొస్తే.. జగన్ శవ రాజకీయాలు కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘తన హయాంలో ఏపీ పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో మొహం చూపించలేకే ఆయన హస్తిన వెళ్లారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెబుతారు. జగన్కు పదవీ కాంక్ష తప్ప మరో ఆలోచన లేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News January 8, 2026
క్రెడిట్ రిపోర్టులో SMA పడిందా? ఇక కష్టమే..

లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో కట్టకపోతే బ్యాంకులు ఆ అకౌంట్ను SMA (Special Mention Account)గా గుర్తిస్తాయి. ఇది మీరు దివాలా తీసే ఛాన్స్ ఉందని ఇచ్చే ఒక వార్నింగ్ బెల్. మీ బకాయి 1 నుంచి 90 రోజుల వరకు ఆలస్యమయ్యే కొద్దీ ఇది SMA-0 నుంచి SMA-2కి మారుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఒక్కసారి క్రెడిట్ రిపోర్టులో SMA పడితే భవిష్యత్తులో కొత్త లోన్లు రావడం కష్టమవుతుంది.
News January 8, 2026
‘మున్సిపోల్స్’లో పట్టు కోసం పార్టీల కసరత్తు

TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. సంక్షేమ పథకాల అజెండాతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లనుంది. అటు CM రేవంత్ జిల్లాల్లో సభల్లో పాల్గొంటారు. FEB3-9 మధ్య 9 ఉమ్మడి జిల్లాల్లో ఉండే ఈ టూర్ MBNRలో మొదలవుతుంది. ఇక ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక పెండింగ్ అంశాలతో BRS స్పెషల్ మ్యానిఫెస్టో రూపొందించనుంది. అర్బన్లో పట్టుకై BJP సీరియస్గా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తోంది.
News January 8, 2026
KVS, NVSలో 15,762 ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

KVS, NVSలో 15,762 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు <


