News July 24, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో పల్లెల అభివృద్ధికి బాసట

కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం హర్షనీయం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 385 వంతున, తూ.గో జిల్లాలో 300 పంచాయతీలు ఉన్నాయి. సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా వినియోగించాలి. పల్లెల్లోని పీఆర్, ఆ&బీ రహదారులకు మోక్షం దక్కాలి. రూ.1,203 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్, రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాలు చేపట్టాలి.
Similar News
News February 6, 2026
రాజమండ్రి: అభ్యర్థులు గమనించాలి.. పరీక్ష తేదీ, కేంద్రం మార్పు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(DLSA) నియామక పరీక్షల తేదీ, కేంద్రంలో మార్పులు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ప్రకటించారు. ఈనెల 8న జరగాల్సిన పరీక్షను 11వ తేదీకి మార్చారు. అలాగే పరీక్షా కేంద్రాన్ని మహిళా కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాలకు మార్చినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ పోస్టులకు కేటాయించిన రిపోర్టింగ్ సమయాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
News February 6, 2026
8న జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రాజమండ్రి జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులో చెరుకూరి వీర్రాజు కన్వెక్షన్ హాల్లో జరుగనుంది. 8న బూరుగుపూడి గేట్ నుంచి భారీ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పాల్గొనున్నారు. జిల్లా అగ్ర నాయకుల సమక్షంలో టీడీపీ జిల్లా రథసారథి, కార్యవర్గ సభ్యులు ప్రమాణం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News February 6, 2026
ఉగాది నాటికి 8,378 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి: పీడీ

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.


