News July 24, 2024

సదాశివనగర్: 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగలేదు: NHAI

image

సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామశివారులో 44 నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం హైవే అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి రోడ్డును పరిశీలించారు. రోడ్డు కుంగలేదని, ఒక ఇనుప పట్టి విరిగిందని, దాని పక్కన ఉన్న డాంబర్ వర్షపు తాకిడికి లేచిందని అధికారులు తెలిపారు.

Similar News

News January 1, 2026

NZB: న్యూ ఇయర్.. న్యూ కలెక్టర్ ముందున్న సవాళ్లు

image

నిజామాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం ముందు కొత్త కలెక్టర్ ముందు ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ముఖ్యంగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలి. అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలయ్యేలా చూడాలి. అయితే ఆమె నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు.

News January 1, 2026

NZB: న్యూ ఇయర్ కేక్ కోసిన సీపీ

image

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నూతన సంవత్సర స్వాగత సంబరాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేకు కోసి నగర పోలీస్ అధికారులకు తినిపించారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

News January 1, 2026

NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.