News July 24, 2024

విద్యకు ప్రాధాన్యం.. విద్యార్థుల్లో ఆనందం

image

దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10 లక్షలు కేటాయిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి తూ.గో జిల్లాలో విద్యార్థులకు ఊరట నిచ్చింది. కాకినాడ JNTU పరిధిలో 341 అనుబంధ కళాశాలలు, నన్నయ వర్సిటీ పరిధిలో 434 కళాశాలలు ఉన్నాయి.

Similar News

News October 8, 2024

తూ.గో: 9న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న నాదెండ్ల

image

తూ.గో.జిల్లా కాపవరం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాధిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొంటారన్నారు.

News October 7, 2024

మంత్రి నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్‌ మోకా

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్‌ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

News October 7, 2024

రంపచోడవరం: CRPF జవాన్ మృతి

image

చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.