News July 24, 2024
బ్రాండ్ మద్యాన్ని కనుమరుగు చేశారు: చంద్రబాబు

AP: దేశమంతా దొరికే బ్రాండ్ మద్యం ఏపీలో దొరక్కుండా గత YCP ప్రభుత్వం చేసిందని CM చంద్రబాబు దుయ్యబట్టారు. ‘వాళ్లు అనుమతించిన బ్రాండే మద్యం షాపులో దొరుకుతుంది. MNC బ్రాండ్లన్నీ కనుమరుగయ్యేలా చేశారు. మాన్యుఫాక్చరింగ్ యూనిట్లన్నీ YCP నేతల చేతుల్లోకి వెళ్లాయి. కొత్తగా 26 కంపెనీలు, 38 రకాల లోకల్ బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.
Similar News
News September 14, 2025
టాస్ గెలిచిన భారత్

మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్
News September 14, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి, HNK, HYD, BPL, JGL, JNM, KMM, ASF, మేడ్చల్, MHBD, MNCL, MUL, NLG, NRML, PDPL, రంగారెడ్డి, సంగారెడ్డి NZM, WGL జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని తిరుపతి, ప.గో తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
News September 14, 2025
YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా

AP: వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని BJP జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. YCP అవినీతిపాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారన్నారు. విశాఖలో ‘సారథ్యం’ సభలో ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు దేశంలో ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోలు తీసుకువచ్చి అధికారంలోకి వచ్చేవారు. దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు ఉండేవి. 2014 తర్వాతే దేశంలో మార్పులు వచ్చాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.