News July 24, 2024

ఢిల్లీలో జగన్ డ్రామా: హోంమంత్రి అనిత

image

AP: సినిమా సెట్టింగులా మాజీ సీఎం జగన్ ధర్నా ఉందని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారంతో, ఢిల్లీలో జగన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 36 మంది హత్యకు గురైతే ఇప్పుడు ఎందుకు జగన్ బయటకు వచ్చారని ప్రశ్నించారు. మరణించిన వారి పేర్లు ఇవ్వాలని కోరారు. అవతలి వాళ్లు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందని అన్నారు.

Similar News

News January 30, 2026

వరల్డ్ కప్ గెలిస్తే ఇంకేం చేస్తారో?.. పాక్ పీఎం ట్వీట్‌పై సెటైర్లు!

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్‌కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్‌పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.

News January 30, 2026

మధ్యాహ్నం కునుకు.. బ్రెయిన్‌కు ఫుల్ కిక్కు

image

మధ్యాహ్నం పూట చిన్న నిద్ర (Nap) వల్ల రాత్రి నిద్రతో సమానమైన ఎఫెక్ట్ ఉంటుందని రీసెర్చర్స్ తేల్చారు. వాళ్ల స్టడీ ప్రకారం.. రోజంతా పనులు, ఆలోచనల వల్ల బ్రెయిన్‌లోని నెర్వ్ సెల్స్ బాగా అలసిపోతాయి. ఇలాంటి టైమ్‌లో ఒక చిన్న కునుకు తీస్తే బ్రెయిన్ కనెక్షన్స్ మళ్లీ రీ-ఆర్గనైజ్ అవుతాయి. బ్రెయిన్‌పై లోడ్ తగ్గి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇన్ఫర్మేషన్ మరింత ఎఫెక్టివ్‌గా స్టోర్ అవుతుంది.

News January 30, 2026

బోర్ కొడుతుందని ఖాళీ సమయంలో చదివి..!

image

రైలులో వెళ్లే సమయాన్ని చదివేందుకు కేటాయించి BARC శాస్త్రవేత్తగా ఎదిగిన వేలుమణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కోయంబత్తూర్‌ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకోగా పేదరికంతో హాస్టల్‌లో ఉండలేక రోజూ రైలులో ప్రయాణించేవారు. ఈ జర్నీలో రోజుకు 6 గంటల ఖాళీ టైమ్ దొరికేది. ఈ సమయంలో గణితం, ఫిజిక్స్‌ చదువుకున్నానని వేలుమణి ట్వీట్ చేశారు. ఆయన స్థాపించిన థైరోకేర్ టెక్నాలజీస్ నెట్‌వర్త్ రూ.5వేల కోట్లు.