News July 24, 2024
అధికార యంత్రంగం సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్గా భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టర్ను కలిసి పుప్పగుచ్ఛం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని చెప్పారు.
Similar News
News October 1, 2024
MLC ఎన్నికలకు ఓట్లు నమోదు చేసుకోండి: జూలకంటి
కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. మాచర్లలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఓటర్ లిస్టు ఉండదని అందరూ నూతనంగా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్స్ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News September 30, 2024
లడ్డూలా దొరికిపోయిన బాబు: అంబటి రాంబాబు
తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు!’ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది.
News September 30, 2024
US కాన్సులేట్ ప్రతినిధులతో మంత్రి అనిత సమావేశం
రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై హోం మంత్రి చర్చించారు. అమెరికా వెళ్లాలనుకునే వారు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని అన్నారు. వీసా అప్లికేషన్ సిస్టం సులభతరం చేయవలసిందిగా హోమ్ మంత్రి కోరగా యూఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారన్నారు.