News July 25, 2024

26 నుండి ఇంటింటి జ్వర సర్వే: కలెక్టర్

image

ఈనెల 26 నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో “ఇంటింటి జ్వర సర్వే” నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. “ఇంటింటి జ్వర సర్వే” లో భాగంగా తక్షణమే మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News March 2, 2026

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 1, 2026

నల్గొండ: పంచాయతీ నిధులపై పాత, కొత్త ‘సర్పంచుల’ పోరు

image

గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఇప్పుడు పాత, కొత్త సర్పంచుల మధ్య చిచ్చు పెడుతోంది. గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుత నిధుల నుంచి ఆ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త సర్పంచులు తమ అభీష్టం మేరకే
నిధులు ఖర్చు చేస్తామంటున్నారు. పాత బిల్లులు చెల్లించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

News March 1, 2026

నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.