News July 25, 2024

కేంద్ర మంత్రిని కలిసిన రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పొగాకు అదనపు పంటపై జరిమానా మాఫీ చేయడం పట్ల ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News January 20, 2026

తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

image

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.

News January 20, 2026

27న PDS బియ్యం బహిరంగ వేలం

image

తూర్పుగోదావరి జిల్లాలో 6-A కేసుల కింద స్వాధీనం చేసుకున్న 3335.828 క్వింటాళ్ల PDS బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు కలెక్టర్ వై.మేఘా స్వరూప్ మంగళవారం తెలిపారు. జనవరి 28న కలెక్టరేట్ వద్ద ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు జనవరి 27న కార్యాలయంలో ఉంచిన బియ్యం నమూనాలను పరిశీలించవచ్చని సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొని బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.

News January 19, 2026

రాజమండ్రిలో ప్రయాణికుల కష్టాలు.. స్పందించిన మంత్రి

image

రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు లేక <<18899041>>ప్రయాణికులు <<>>పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించారు. జిల్లా ప్రజా రవాణా అధికారితో మాట్లాడి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని అధికారులు ఆయనకు వివరించారు.