News July 25, 2024

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం: ఉత్తమ్

image

TG: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌లో త్వరలో అవకాశం కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అయితే అంతకుముందు విధివిధానాలు, అర్హుల విషయమై మంత్రిమండలిలో చర్చించాల్సి ఉంటుందన్నారు. రేషన్ కార్డుల కోసం ప్రజావాణిలో ఇప్పటి వరకు 1,944 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని మంత్రి తెలిపారు.

Similar News

News July 5, 2025

రేపు తొలి ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు: పండితులు

image

హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న (ఆదివారం) వచ్చింది. రేపు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News July 5, 2025

మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

image

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని స‌మ‌గ్ర శిక్షా ప‌థ‌క రాష్ట్ర సంచాల‌కుడు B.శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్ర‌మే విట్నెస్ న‌మోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్ప‌ష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహ‌లు వీడాలని సూచించారు. ప్ర‌భుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవ‌రితోనైనా సంత‌కం చేయించొచ్చని పేర్కొన్నారు.

News July 5, 2025

గిల్ సరికొత్త చరిత్ర

image

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్‌గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్‌గానూ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్‌తో ఆడుతున్నారు.